దళితబంధు యూనిట్ల పంపిణీలో
జుక్కల్ ఎమ్మెల్యే షిండే, డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి
పిట్లం/నిజాంసాగర్, జూన్ 22 : రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. వారిని ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చేందుకే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళితబంధు పథకం కింద ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను పిట్లం మండలపరిషత్ కార్యాలయం వద్ద డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశయం మేరకు దళితబంధు లబ్ధిదారులు కష్టపడి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విజయ్, అన్నారం వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, నర్సాగౌడ్, జగదీశ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సిమెంట్, ఐరన్ దుకాణం ప్రారంభం
నిజాంసాగర్ మండలకేంద్రంలో దళితబంధు లబ్ధిదారుడు ఏర్పాటు చేసుకున్న సిమెంట్, ఐరన్ దుకాణాన్ని ఎమ్మెల్యే షిండే ప్రారంభించారు. నిజాంసాగర్ను దళితబంధు పథకానికి పైలెట్ మండలంగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. మండలంలోని మొత్తం 1309 దళిత కుటుంబాలు ఉండగా, ఇప్పటి వరకు సుమారు 1100 యూనిట్లను పంపిణీ చేశామని తెలిపారు. మిగితా యూనిట్లను త్వరలోనే అందజేస్తామన్నారు. నాయకులు రాజు, లింగాగౌడ్ తదితరులు ఉన్నారు. నిజాంసాగర్ మండలంలోని తున్కిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన ట్రాక్టర్లను స్థానిక సర్పంచ్ వసంత, ఎంపీటీసీ సభ్యురాలు లచ్చవ్వ పంపిణీ చేశారు.