వినాయక్నగర్, ఏప్రిల్ 2: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్ను మంగళవారం ప్రారంభించారు. మొదటి రోజు ఓ బాధితుడు తాను సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు సీపీ కల్మేశ్వర్ సింగెనవార్కు ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్లో మొదటిరోజు తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ డీఎస్పీ తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ.లక్షకు పైగా డబ్బులు పోగొట్టుకున్న బాధితులు సీపీ ఆఫీస్ వెనుక ఏర్పాటు చేసిన సైబర్క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.