వినాయక్నగర్, మార్చి 31: సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు పోలీస్ శాఖ వెలుసుబాటు కల్పిస్తున్నది. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ను ఈ నెల 2వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్టేషన్లో రూ.లక్ష నుంచి అంతకన్నా ఎక్కువగా సైబర్ నేరాలకు గురైతే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. బాధితులు చేసిన ఫిర్యాదుపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తామని, రూ.లక్ష కన్నా తక్కువగా ఉన్న సైబర్ నేరాలపై బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయవచ్చని సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు 1930కి కాల్ చేయడం లేదా www.cybercrime. gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చని వివరించారు.