నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ మండలం రాజారామ్ నగర్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.
గ్రామశివారులోని శ్మశానవాటికలో దంపతులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమనించి పట్టుకున్నారు.
వీరిని స్థానికంగా ఓ ఫైల్స్ క్లీనిక్ నిర్వహించే సమీరా రాయ్ అతడి భార్య సిఫ్రా రాయ్గా గుర్తించారు. భార్యాభర్తలిద్దరూ నాలుగు నెలలుగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్మశానవాటిలో క్షుద్ర పూజలు జరిగినట్లు తెలియడంతో స్థానికులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి