డిచ్పల్లి, జూలై 26 : టీయూలో18మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రెండురోజుల క్రితం ఐదుగురు విద్యార్థులు హైదరాబాద్లో జరిగిన మీటింగ్కు హాజరై తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం నుంచి నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురై జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో నిజామాబాద్లోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించున్నారు. వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
వారిని చికిత్స కోసం ఐసొలేషన్కు తరలించారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు మంగళవారం ఉదయం 102 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు.అందులో ఏడుగురు విద్యార్థినులు, 8మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ ఐసొలేషన్ కేంద్రానికి తరలించకుండా యూనివర్సిటీలోనే ఉంచడంతో మిగిలిన విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. 18 మందికి కరోనా సోకిన విషయాన్ని గోప్యంగా ఉంచడంతో మిగిలిన విద్యార్థులు అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిరక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనా సోకిన 15మంది వసతి గృహంలో ఉండకుండా బయట తిరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.