వేల్పూర్, సెప్టెంబర్ 19: పేదలు ఆత్మగౌరంతో జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో బాల్కొండ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సొంత మండలం వేల్పూర్ మండలంలోని పడగల్లో రూ. 6కోట్ల 29లక్షల 84వేలతో 96 డబుల్ బెడ్ ఇండ్లను నిర్మించారు. వీటిని నేడు (బుధవారం) మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రారంభించనున్నారు.బాల్కొండ నియోజకవర్గంలోని 8 మండలాల్లో 1184 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో వేల్పూర్లో 112 ఇండ్లు, మోర్తాడ్లో 224, భీమ్గల్ మండలం బడాభీమ్గల్లో 112 ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడం తో వీటిని ఇది వరకే లబ్ధిదారులకు అందజేశారు. వేల్పూర్ మండలంలోని పడగల్లో 96 ఇండ్లు లబ్ది దారులకు మంత్రి చేతుల మీదుగా నేడు పంపిణీ చేయనున్నారు. బాల్కొండ లో 176, భీమ్గల్లో 288, కమ్మర్పల్లిలో 64, మెండోరాలో 64 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మా ణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. వీటిని కూడా త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా పడగల్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. సొంతింటి కల సాకారమవుతుండడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ముస్తాబు చేశారు. అన్ని సౌకర్యాలతో ఇండ్ల నిర్మాణం పూర్తిచేశారు. ఇవి ఆధునిక విల్లాలా కనిపిస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయానికి రోడ్లుకు ఇరువైపులా ఆందమైన పచ్చని మొక్కలు నాటారు.నిర్మాణ పనులను మంత్రి ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తూ వచ్చారు.అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూశారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లను నిర్మించారు.
సీఎం కేసీఆర్,మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో గ్రామంలో 96 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. గ్రామంలోని 96 కుటుంబాలకు మేలు జరుగుతుంది. సొంతిల్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటున్న వారికి ప్రతి నెలా అద్దె చెల్లించడం భారంగా ఉండేది. ప్రస్తుతం వారికి మంత్రి వేముల సహకారంతో సొంతింటి కల నెరవేరింది. 96 మందికి సొంతింటి కల నెరవేర్చిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటాం.
-డి.వర్షిణి, సర్పంచ్, పడగల్
మాది పేద కుటుంబం.. మేము రోజు పనిచేస్తే కా నీ ఇల్లు గడిచేదికాదు. కొన్నేండ్ల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం.కేసీఆర్ ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయడంతో మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది కలనా నిజమేనా అన్నట్లుగా ఉంది.కేసీఆర్,మంత్రి ప్రశాంత్రెడ్డి దయతో మాకు సొంతిల్లు దక్కడం ఆనందంగా ఉంది.
-ఫాతిమా బేగం, పడగల్
కేసీఆర్ పుణ్యమా అని మాకు సొంతింటి కల నెరవేరింది. కొన్నేం డ్ల నుంచి మేము కిరాయి ఇంట్లో ఉంటు న్నాం. నెలనెలకు అద్దె కట్టలేక ఇబ్బందులు పడ్డాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో మాకు సొంతిల్లు దక్కింది.
మేము కొన్నేండ్లు నుం చి అద్దె ఇంట్లో ఉంటు న్నాం. మాకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరుచేయడం మాకెంతో ఆనందంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మా కుటుంబ సభ్యులందరం రుణపడి ఉంటాం.
-ఆవాల యాదమ్మ, లబ్ధిదారు, పడగల్