తాడ్వాయి, అక్టోబర్ 2: ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మండలంలోని నందివాడ, బ్రహ్మాజివాడి గ్రామాల్లోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు యువకులు, నాయకులు సోమవారం ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నందివాడకు చెందిన రెడ్డి సంఘం యువకులు 50 మంది, బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు 30 మంది ఉన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్రెడ్డి, సర్పంచ్ స్వాతీవినోద్గౌడ్, ఉప సర్పంచ్ మల్లికార్జున్, నాయకులు రాజాగౌడ్, రాజయ్య, బాల్రెడ్డి, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.