సిరికొండ, ఫిబ్రవరి 9 : సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మైలారం గంగారెడ్డి, వైస్చైర్మన్ అయిత ప్రకాశ్పై డైరెక్టర్ల తీర్మానం మేరకు శుక్రవారం అవిశ్వాస సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్, వైస్చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంటకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రావడంతో.. ఫలితాన్ని వెల్లడించలేదు. 11 మంది డైరెక్టర్లు హాజరై, చైర్మన్కు వ్యతిరేకంగా 9 మంది, వైస్చైర్మన్కు వ్యతిరేకంగా పది మంది చేతులెత్తి అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లు సమాచారం.
ఈ సమావేశానికి చైర్మన్, వైస్చైర్మన్ గైర్హాజరయ్యారు. హైకోర్టు ఉత్వర్వుల మేరకు ఈ నెల 15 వరకు ఫలితాలను ప్రకటించవద్దని డీసీవో శ్రీనివాసరావు ఆదేశించారు. సమావేశంలో ఆడిట్ టీం సభ్యులు ఆనంద్, పాపయ్య, రవీందర్, డైరెక్టర్లు పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానంపై హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడం సిగ్గిచేటని డైరెక్టర్లు ఆరోపించారు.