డిచ్పల్లి, ఫిబ్రవరి 11 : తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమం గురుకులాలు, టీఎస్ఆర్ఎస్ పాఠశాలల్లో (2024-25 ) 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించినట్లు రీజినల్ కో-ఆర్డినేటర్ అలివేలు తెలిపారు. నిజామాబాద్ రీజియన్లో 44 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 17, కామారెడ్డిలో 11, నిర్మల్లో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రవేశ పరీక్షకు నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5881 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 5559 మంది పరీక్షకు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లాలో 4160 మంది విద్యార్థులకు 3895 మంది, నిర్మల్ జిల్లాలో 5650 మందికి 5385 విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. రీజియన్ పరిధిలో హాజరు శాతం 94.57శాతం నమోదైనట్లు తెలిపారు.