కామారెడ్డి, మార్చి 17: ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటు వేయడానికి 12 రకాల గుర్తింపు కార్డులను ఉపయోగించుకోవచ్చని, దీనిపై రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీవరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు 72 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని సూచించారు. కార్యక్రమంలో రాజకీయ నరేందర్, ప్రభాకర్రెడ్డి, కాశీంఅలీ, మదన్లాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.