రాజంపేట్, జనవరి 9: ప్రజాపాలన దరఖాస్తులను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. రాజంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న డాటాఎంట్రీ ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులను పకడ్బందీగా, ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. ఈ నెల 17వ తేదీలోపు డాటా ఎంట్రీ పూర్తయ్యేలా ఎంపీడీవో, తహసీల్దార్లు పర్యవేక్షించాలని సూచించారు. ఆర్డీవో శ్రీనివాస్రెడ్డి, డీఎల్పీవో సాయిబాబా, తహసీల్దార్ అనిల్కుమార్, ఎంపీడీవో బాలకిషన్ ఉన్నారు.