గద్వాల, ఆగస్టు 10 : వైద్యురాలిగా ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన ప్రియాంక మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అ యిజ మండలం ఎక్లాస్పూర్ గ్రా మంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆమె గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే తలంపుతో వైద్య విద్య అభ్యసిస్తూ అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిం చి వేసిందన్నారు.
కారు ఎక్కించి తీవ్రంగా గాయపరిచిన నిందితులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రియాంక వైద్య ఖర్చులు ప్రభు త్వం భరించడంతోపాటు ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.కోటి ఆర్థిక సహాయం అం దించాలని డిమాండ్ చేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్ర సాదించాలని కోరారు. అదేవిధంగా మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానూభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.