Dharpally | ధర్పల్లి, ఫిబ్రవరి 1: పరిపాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.