బాన్సువాడ టౌన్, అక్టోబర్ 24 : బాన్సువాడ పట్టణంలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న పార్టీ భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండాచూడాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. సభా ఏర్పాట్లను ఆయన మంగళవారం డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. భారీ ఎత్తున పార్టీ శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మండలాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగు ఏర్పాట్లను చేయాలని స్పీకర్ పోచారం సూచించారు. స్పీకర్ వెంట బాన్సువాడ పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్, పార్టీ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బాన్సువాడ ఎంపీపీ నీరజా వెంకట్రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్, అక్టోబర్ 24: ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 3న ఆర్మూర్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డులో సభాస్థలి ఏర్పాటు కోసం స్థలాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి పరిశీలించారు. సభా స్థలి ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. జీవన్రెడ్డి స్వయంగా ట్రాక్టర్తో సభాస్థలి ప్రదేశాన్నిశుభ్రం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పీసీ గంగారెడ్డి, చింటూ తదితరులు ఉన్నారు.