భీమ్గల్: పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీలక్ష్మణ్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం, సొసైటీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మండలానికి చెందిన 194 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 25మందికి షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డ పెండ్లిళ్లకు సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ప్రతి ఆడపిల్ల ఇంటికి అండగా ఉంటున్న సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజేందర్, సొసైటీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ భగత్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోయిజ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నర్సయ్య, నియోజకవర్గ సమన్వయ సభ్యులు గణ్వీర్ రెడ్డి, తుక్కాజీ, రైతుబంధు మండల కన్వీనర్ శర్మనాయక్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తోట శంకర్ ,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.