వేల్పూర్, అక్టోబర్ 29 : బాల్కొండ నియోజకవర్గంలో నవంబర్ 2న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేల్పూర్ మండలంలోని స్పైస్పార్కు వేదికగా నిర్వహించనున్న సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలి, పార్కింగ్, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించి సభా ఏర్పాటు పరిశీలకులకు మంత్రి వేముల పలు సూచనలు చేశారు.