కమ్మర్పల్లి/ వేల్పూర్/భీమ్గల్/ బాల్కొండ/ మెండోరా/ ముప్కాల్/ ఏర్గట్ల/ నవంబర్ 2: వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఉదయం నుంచే బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వేల్పూర్ దారి పట్టారు. దారులన్నీ కేసీఆర్ సభకు వచ్చే జనాలతో సందడిగా మారిపోయాయి. కేసీఆర్ సభా వేదిక పైకి రావడానికి రెండు గంటల ముందే సభా మైదానం నిండిపోయింది. 43 ఎకరాల సభా మైదానం జనంతో నిండిపోయింది. దీంతో కాలినడకన చేరుకొని కేసీఆర్, ప్రశాంత్రెడ్డి సందేశాలను ఆసక్తిగా విన్నారు. జై కేసీఆర్, జై ప్రశాంత్రెడ్డి అంటూ నినాదాలు చేశారు. వేల్పూర్ ఎక్స్రోడ్డు నుంచి. సభాస్థలి వరకు రహదారి పైన నిండుగా తరలివస్తున్న జనం జనధారను తలపించింది. మహిళలు, యువకులు ఉత్సాహంగా తరలి వచ్చారు. కేసీఆర్,ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు ఈలలు, చప్పట్లతో హోరెత్తిస్తూ మద్దతును చాటారు.
ముసలోళ్లు, మొగుడు లేనోళ్లకు, కాళ్లుచేతులు మంచిగ లేనోళ్లకు పింఛన్లు ఇచ్చి సీఎం కేసీఆర్ దేవుడైండు. ఇంటికి పెద్ద దిక్కై మంచి చెడు చూస్తున్నడు.అప్పట్ల ఉన్న కాంగ్రెసోళ్లు ఏం చేసిండ్రని మల్ల మాఇండ్ల పొంటి తిరుగుతున్నరు. మళ్లీ కేసీఆర్ కే ఓటేస్తం.. మంచి పనులు చేసిన ప్రశాంత్ రెడ్డిని ఎన్నటికీ మరచిపోం.
గ్రామంల ఎన్నడూ సూడనంత పను లు జేసినందుకు ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉంటారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నా రు. ప్రశాంత్ రెడ్డి వచ్చినంకనే మా గ్రామం మస్తు అభివృద్ధి అయ్యింది. మల్ల కొత్తగా వచ్చిన వారిని మేము నమ్మం. గన్నేండ్లు పరిపాలించిన కాంగ్రెసోళ్లు అప్పుడేం జేసిండ్రు.. ఇప్పుడేం ఒరగబెడతామని ఓట్లడుగుతుండ్రు.
బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం చేసిన సా యంతో అన్ని కులాలు ఆర్థికంగా బలపడ్డాయి. మ త్స్యకారులు, ఇతర కులాలకు చెందిన వారు గతంలో జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లేవారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ సారు అన్ని వృత్తుల వారికి అండగా నిలుస్తున్నారు.ఉచితంగా చేప ల్లలు, మోపెడ్లు, డీసీఎంలు అందజేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు, తాగునీటి వసతి ఎట్లుండెనో అందరికీ తెలుసు. ఇంటింటికీ తాగునీటికి కూడా ఇవ్వలేరు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటుచేసి నీళ్లు ఇస్తున్నరు. మహిళలకు ఉన్న పెద్ద సమస్యను తీర్చారు.