మాక్లూర్, సెప్టెంబర్ 4 : మోదీ ప్రభుత్వం ఉచిత పథకాలు వద్దంటూ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నదని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ఆరోపించారు. ఆదివారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్ను నిలదీసి మాట్లాడడం ఐఏఎస్ క్యాడర్కు అవమానకరమన్నారు. ఆమె వ్యవహరించిన తీరు హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర మంత్రి హరీశ్రావు వేసిన ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ జవాబు ఇవ్వకుండా తప్పించుకున్నారని అన్నారు. హరీశ్రావు రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరినా స్పందన లేదన్నారు. దర్యాప్తు సంస్థలతో మోదీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అలాం టి వాటికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు బెదరబో రని అన్నారు.
రైతుల మోటర్లకు మీటర్లు పెడుతామని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని, మోదీకే మీటర్లు పెడుతామని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు ఇష్టారీతిన మాట్లాడితే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు. కేంద్రానికి రూ.3లక్షల కోట్ల 70 లక్షలు పన్నుల రూపంలో చెల్లిస్తుంటే కేంద్రం తెలంగాణకు రూ.లక్షా 65 వేల కోట్లు మాత్రమే ఇస్తోందన్నారు. సంక్షేమ పథకాల వద్ద మోదీకి బదులుగా కేసీఆర్ బొమ్మలు పెట్టుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతంచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి డ్వాక్రా మహిళలు, రైతులు సభకు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఎంపీటీసీ పురుషోత్తంరావు, టీఆర్ఎస్ నాయకులు శేఖర్రావు, అంజయ్య, శ్యామ్రావు, విఠల్రావు, గంగాధర్, భూపతి, సవిన్ పాల్గొన్నారు.