నిజామాబాద్, ఏప్రిల్ 14: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు(సోమవారం) బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. బాన్సువాడలోని మీనా గార్డెన్లో ఉదయం 9 గంటలకు, గాంధారిలో 11 గంటలకు, బిచ్కుంద మండల కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు సమావేశాలు నిర్వహించనుండగా.. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్తోపాటు మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్ హాజరుకానున్నారు. భీమ్గల్ పట్టణంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులు తరలిరావాలని నాయకులు కోరారు.