కోటగిరి/రుద్రూర్, ఏప్రిల్19 : కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ శనివారం (నేడు) రోడ్ షో నిర్వహించనున్నట్లు డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్రెడ్డి తెలిపారు. కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్లో, రుద్రూర్ మండలకేంద్రంలోని శశిరేఖ గార్డెన్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. రుద్రూర్లో సాయంత్రం రోడ్ షో ఉంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఎక్లాస్పూర్లో నిర్వహించిన సమావేశంలో జడ్పీటీసీ శంకర్పటేల్, మాజీ సర్పంచులు, నాయకులు, రుద్రూర్లో నిర్వహించిన సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, కోఆప్షన్ సభ్యుడు మస్తాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ సంజు, అంబం మాజీ సర్పంచ్ కోర్వ భాగ్య, పట్టెపు రాములు, దోవింద్రావు, నాగేందర్, రమేశ్, సురేశ్, సులేమాన్నగర్ మాజీ సర్పంచ్ ఖాదర్, కౌలాస్ గంగాధర్ పాల్గొన్నారు.