బోధన్/శక్కర్నగర్/ఎడపల్లి/బోధన్రూరల్, నవంబర్ 11: బోధన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఎమ్మెల్యేగా షకీల్ను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఎడపల్లి మండలంలోని అంబం, ఏఆర్పీ, బ్రాహ్మణ్పల్లి గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆయేషా ఫాతిమాతోపాటు జడ్పీ వైస్ చైర్ పర్సన్ రజితా యాదవ్, ఎంసీసీ కొండెంగల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరాం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, పార్టీ నాయకులు ఎల్లయ్య యాదవ్, పార్టీ మండల ఇన్చార్జి వాసిక్, నాయకులు, కార్యకర్తలు రథం ద్వారా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో సుమారు 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బోధన్ పట్టణంలోని 28వ వార్డులో ఆ వార్డు ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ నక్క లింగారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా వార్డులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా మహ్మద్ షకీల్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఓటర్లకు వివరించారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, ఏదోఒక రకంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు పొందని కుటుంబం లేదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అల్తాఫ్, లింగం, గంగారాం, సాయిలు, జమీల్, పోశెట్టి, కుంటోల్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.
శక్కర్నగర్, నవంబర్ 11: బోధన్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు నర్సాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎస్టీసెల్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్ జాదవ్ నాయక్, సీనియర్ నాయకుడు ఎండీ ఉస్మాన్ ఖాన్ తదితరుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. మరోమారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అందరినీ ఆదుకునే విధంగా రూపొందించిన మ్యానిఫెస్టో అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా సౌభాగ్యలక్ష్మి, బీపీఎల్ కింద వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి కేసీఆర్ బీమా, రేషన్ కార్డుపై సన్న బియ్యం అందించే పథకాలను ప్రజలకు వివరించారు.
నవీపేట, నవంబర్ 11: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్కు మద్దుతుగా గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్రెడ్డి సొంత గ్రామం సిరన్పల్లిలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు జోరుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు గులాబీ జెండాలు చేతబూని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్రావు మాట్లాడుతూ 15 ఏండ్లపాటు అధికారంలో ఉన్న సుదర్శన్రెడ్డి గ్రామాభివృద్ధిని విస్మరించడంతో గ్రామస్తులు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తెడ్డు పోశెట్టి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఇన్చార్జుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.
బోధన్ రూరల్, నవంబర్ 11: ప్రజల కోసం పని చేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని డీసీసీబీ డైరెక్టర్ గిర్దవర్ గంగారెడ్డి అన్నారు. బోధన్ మండలంలోని సంగం, ఊట్పల్లి, రాజీవ్నగర్ తండా తదితర గ్రామాల్లో షకీల్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ బోధన్ మండల అధ్యక్షుడు ధర్మయ్యగారి సంజీవ్కుమార్, ప్రధాన కార్యదర్శి సిర్పా సుదర్శన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ మానిక్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ హన్మంతు, సిరాజ్, భవానిపేట్ సర్పంచ్ కృష్ణప్రసాద్, గంగారెడ్డి, నాయకులు విఠల్నాయక్, మోతీరాం నాయక్, సురేందర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్ అన్నారు. సాలూర మండల కేంద్రంలో ఎమ్మెల్యే షకీల్కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు డిస్కో సాయిలు తదితరులు పాల్గొన్నారు.
రెంజల్, నవంబర్ 11: బీఆర్ఎస్ సర్కారు మళ్లీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కేసీఆర్ బీమాను అమలు చేస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శేషుగారి భూమారెడ్డి, రెంజల్ సర్పంచ్ రమేశ్ కుమార్ అన్నారు. దూపల్లి, రెంజల్, గ్రామాల్లో బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ తరఫున ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోససోవద్దని, ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా షకీల్ను మరోసారి గెలిపించాలని కోరారు. దూపల్లిలో బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గోపాల్రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎన్.సంజీవ్, ఉపసర్పంచ్ కంచ సాయిలు, మాజీ సర్పంచ్ సుదర్శన్ యాదవ్, రెంజల్లో మాజీ విండో చైర్మన్ అసాని ప్రశాంత్, సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.