నిజాంసాగర్, జనవరి 20: ఇతర రాష్ర్టాల్లోనూ బీఆర్ఎస్పార్టీకి ఆదరణ లభిస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుందలోని ఎమ్మెల్యే నివాసంలో జుక్కల్ మండలంలోని సావర్గావ్, మహ్మదాబాద్ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం చెక్కులను ఆయన శుక్రవారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుంటే నేడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని అన్నారు. అందుకే ఇతర రాష్ర్టాల్లో సైతం బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ పిల్లల పెండ్లికి ఓ వరంలా మారిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నీలూపటేల్, బొల్లి గంగాధర్, అనితా సింగ్, సర్పంచులు కిషన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.