జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడగా.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు బోసిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని హంగులతో ఈ కార్యాలయ భవనాలను నిర్మించగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు తెరుచుకోకపోవడం గమనార్హం.
ఏదైనా పనివిషయమై వచ్చే ప్రజలకు అక్కడ గేట్లకు వేసిన తాళాలే దర్శనమిస్తున్నాయి. నిజామాబాద్ రూరల్, బోధన్ ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, సుదర్శన్రెడ్డి కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడడంలేదు. రిపబ్లిక్ డే రోజున కూడా జాతీయ జెండాను ఆవిష్కరించకపోవడంతో కార్యాలయాలు కళావిహీనంగా కనిపించాయి.