కోటగిరి, నవంబర్ 15 : కొందరు నాయకులు టూరిస్టుల్లా వస్తుంటారని వారిని ప్రజలు నమ్మొద్దని బాన్సు వాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతంగల్ మండలంలోని బర్ధిపూర్, కల్లూర్, కొడిచెర్ల, పాత పొతంగల్, కొత్త పొతంగల్, హంగర్గా, జల్లాపల్లి ఫారం, జల్లాపల్లి అబాదిలో బుధవారం విస్తృ తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోచారానికి గ్రామాల్లో మహిళలు మంగళహారతులు, పూలు చల్లుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో బాన్సువాడను అభివృద్ధి పథంలో నడిపానని, ప్రజలకే తన జీవితం అంకితమని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యా నిఫెస్టో విడుదల చేశారని తెలిపారు. వేల కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అన్నా రు. తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. స్పీకర్ ఆధ్వర్యంలో కల్లూర్, పొతంగల్ తదితర గ్రామాల్లోని పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బర్ధిపూర్, పొతంగల్లో పలు కుల సం ఘాల వారు మద్దతూ తెలుపుతూ ఏకగ్రీవ తీర్మాన పత్రా లు అందజేశారు. జడ్పీటీసీ శంకర్పటేల్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, కిశోర్బాబు, వైస్ ఎంపీపీ గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచులు హన్మంతు, లక్ష్మి, పుష్పలత, వర్ని శంకర్, సునీత విజయ్పటేల్, అమీనాబీ, వివేక్, ఎంపీటీసీలు సుజాత, కేశ వీరేశం, ఉమా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్/నస్రుల్లాబాద్/బాన్సువాడ టౌన్/ వర్ని/కోటగిరి/రుద్రూర్/చందూర్, నవంబర్ 15 : బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బుధవారం బాన్సువాడ పట్టణంతోపాటు బాన్సువాడ రూరల్ మండలం, నస్రుల్లాబాద్, బీర్కూర్, కోటగిరి, వర్ని, రుద్రూర్, చందూర్ మండల కేంద్రాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నిక ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకు ఓటు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు.
వర్ని, నవంబరు 15 : వర్ని మండలంలో పోచారం గురు వారం ప్రచారం నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు గిరి తెలిపారు. మండలంలో ని తగిలేపల్లి, రూప్లానాయక్ తండా, సక్రు నాయక్ తండా, పాత వర్ని, హుమ్నాపూర్, నెహ్రునగర్, వకీల్ ఫారం, శ్రీనగర్ గ్రా మాల్లో స్పీకర్ ప్ర చారం నిర్వహించను న్నట్లు వెల్లడించారు.