వేల్పూర్, జూలై 21: అభివృద్ధి చేసేవారిని ప్రజలు ఆదరించాలని, అబద్ధాలు చెప్పేవారికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుంచి వందమంది యువకులు శుక్రవారం వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ల చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. పార్టీలో చేరి తనకు మరింత బలాన్ని పెంచారన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ సర్కార్ పని చేస్తున్నదని తెలిపారు.
కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపై ప్రజలే ఆలోచన చేయాలని కోరారు. బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించాలని, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. మండలంలోని సావెల్ గ్రామం నుంచి ఎంపీటీసీ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఎస్టీ సంఘం నాయకుడు సంతకాల తిరుపతి, డీ3, ఫర్ఫెక్ట్, ఆర్ఆర్ యూత్ సభ్యులు సుమారు 60 మంది బీఆర్ఎస్లో చేరారు. మండలంలోని పడిగెల్ గ్రామంలో యాల్ల మహిపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి శేఖర్, మహేశ్, వంశీ, బీజేపీ నుంచి విష్ణు, పవన్, శ్రీకాంత్తోపాటు పలువురు యువకులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్లు నాగధర్, శేఖర్రెడ్డి, మెండోరా జడ్పీటీసీ గంగాధర్, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, పడిగెల సర్పంచ్ రాజ్కుమార్, ఎంపీటీసీ శ్యాంరావు, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతు, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.