పచ్చని ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా సంచరించాల్సిన పక్షులు ఆహారం కోసం గ్రామాలకు వస్తున్నాయి. వాటికి ఆహారం లభ్యమైన ప్రాంతంలోకి వచ్చి వాలుతున్నాయి. చందూర్ మండల కేంద్రంలోని ఓ రైస్మిల్లు వద్ద నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలపై గురువారం సాయంత్రం వందల సంఖ్యలో చిలుకలు వచ్చి వాలగా.. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్నవారు ఆసక్తిగా తిలకించారు.