కామారెడ్డి/ ఇందల్వాయి/ నిజామాబాద్ స్పోర్ట్స్, డిసెంబర్ 28: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సైకిల్ యాత్రికుడు రాబిన్ సింగ్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో గురువారం ఆయన సైకిల్ యాత్ర చేపట్టాడు.
వేర్వేరు చోట్ల రాబిన్సింగ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా మూవ్మెంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈటర్ జిల్లా చెక్కరనగర్ తాలూకా నుంచి సైకిల్ యాత్ర చేపట్టానన్నారు. ఇప్పటి వరకు 448 రోజుల్లో 2,648 కి.మీ. సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని, మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఈ సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.