భీమ్గల్, జూలై 22 : భీమ్గల్ ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన బస్డిపోను త్వరలోనే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో పునః ప్రారంభిస్తామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. భీమ్గల్ బస్టాండ్, బస్డిపోను టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి మంత్రి శనివారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ను ఆపే దమ్ము ఎవరికీ లేదని.. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు.
భీమ్గల్ బస్డిపోను పునః ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భీమ్గల్ బస్టాండ్, బస్డిపోను టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలిసి మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూత పడిన బస్డిపోను తిరిగి ప్రారంభించాలన్నది భీమ్గల్ ప్రాం త ప్రజల చిరకాల కోరిక అన్నారు. కాంగ్రెస్ హ యాంలో మూతపడిన బస్డిపోను కేసీఆర్ ప్రభు త్వం పునఃప్రారంభిస్తుందన్నారు. ఆర్టీసీ చైర్మన్ సహకారంతో బస్డిపోను పునఃరుద్ధరిస్తామని తెలిపారు. కొందరు కావాలని బస్ డిపో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇవేమీ తాను పట్టించుకోబోనని స్పష్టం చేశారు. ‘నా నియోజకవర్గ ప్రజలకు ఏమి కావాలో అది చేస్తా’ అని మరోసారి ప్రకటించారు. తాను వేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలు చూడడానికే వాళ్లకు రెండేండ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని..కేసీఆర్ను ఆపే దమ్ము ఎవరికీ లేదని పునరుద్ఘాటించారు.
కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు ప్రశాంత్రెడ్డి
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సోదరుడులాంటి వారని ఆత్మీయత వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూస్తుంటే మంత్రి ప్రశాంత్రెడ్డిపై ఈర్ష్య కలుగుతుందని మంత్రి చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు. మంత్రి వేములతో కలిసి భీమ్గల్ ఆర్టీసీ బస్ డిపో పునరుద్ధరణకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. భీమ్గల్ ప్రాంత ప్రజలతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. వే ల్పూర్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా కారు నడుపుతూ భీమ్గల్ చేరుకోవడం కార్యకర్తలను, ప్రజలను ప్రత్యేకంగా ఆకర్శించింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు, డాక్టర్ మధుశేఖర్, సొసైటీ చైర్మన్ నర్సయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ భగత్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోయిజ్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ముత్తెన్న, కౌన్సిలర్లు మూత లత, నర్సయ్య, గంగాధర్, ఖైరున్నిసా బేగం, షమీం బేగం, ముత్తెన్న, సతీష్, మల్లెల ప్రసాద్, లింగం, మల్లెల రాజశ్రీ, పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, ఆర్టీసీ డైరెక్టర్లు మధుశేఖర్, వినోద్కుమార్, ఆర్ఎం జానారెడ్డి, డిప్యూటీ ఆర్ఎం శంకర్, ఆర్మూర్ డిపో మేనేజర్ కవిత, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.