భీమ్గల్,జనవరి 16 : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. భీమ్గల్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై రాజ్భరత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి భీమ్గల్ బైపాస్లోని జక్లత్ ఒర్రె వద్ద మఫ్టీలో గస్తీ నిర్వహించగా అక్కడ ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని పట్టుకొని విచారించారు. వారి వద్ద ఎండు గంజాయి ఉండడంతో రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.
డిప్యూటీ తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించగా వారి వద్ద 300 గ్రాముల ఎండు గంజాయి లభించింది. వెంటనే వారిని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా ఇందులో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఎస్సై రాజ్భరత్ రెడ్డి, కానిస్టేబుళ్లు సురేశ్, రాజ్కుమార్ను ఈ సందర్భంగా అభినందించారు. గంజాయి అమ్మే వారి సమాచారం అందించినట్లయితే తగిన పారితోషకం అందించనున్నట్లు సీఐ తెలిపారు.