Postal Department | శక్కర్ నగర్ : భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా కళ్యాణ తలంబ్రాలు, ప్రసాదం అందించనున్నట్లు బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ జాదవ్ ప్రకాష్ తెలిపారు. దేవాదాయ శాఖ సూచన మేరకు పోస్టల్ శాఖ ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. శ్రీ రామ నవమి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27న భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారని తెలిపారు.
ఇట్టి కళ్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం పోస్టల్ శాఖ ద్వారా కళ్యాణ తాళంబ్రాలు, ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటికే పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు గాను భక్తులు తమ సమీప ప్రాంతాల్లోని పోస్ట్ ఆఫీస్ లలో సంప్రదించాలని జాదవ్ ప్రకాష్ సూచించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖ బోధన్ అధికారి జాదవ్ ప్రకాష్ తెలిపారు.