Kotagiri | కోటగిరి, ఏప్రిల్ 5 : దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషి చేసిన సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని నవ సమాజ స్థాపన కోసం కృషిచేసిన కృషివలుడు అని కొనియాడారు. సమాజంలో అనగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త అని గుర్తు చేశారు. దేశ అభివృద్ధికి అనగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, నిర్వాహకులు పాల్గొన్నారు.