పిట్లం, నవంబర్ 13: మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు, తిమ్మానగర్, పిట్లం గ్రామానికి చెందిన 10 మంది ఇతర పార్టీలకు చెందిన వారు జుక్కల్ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్షిండే సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి షిండే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ చిల్లర్గి గ్రామశాఖ అధ్యక్షుడు జైపాల్గౌడ్, మాజీ ఎంపీటీసీ హన్మాగౌడ్, తిమ్మానగర్కు చెందిన లక్ష్మణ్, పిట్లం గ్రామానికి చెందిన బాలయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో చిల్లర్గి సర్పంచ్ రమేశ్, తిమ్మానగర్ బీఆర్ఎస్ నాయకులు విజయ్, సాయిరెడ్డి, పిట్లం మండల నాయకులు వాసరి రమేశ్, ప్రతాప్రెడ్డి, అన్నారం వెంకట్రాంరెడ్డి, కుమ్మరి రాములు, జొన్న శ్రీనివాస్రెడ్డి, ఇబ్రహీం, నర్సాగౌడ్, జగదీశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద, నవంబర్ 13: ఎన్నికల్లో రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దని ఎమ్మెల్యే షిండే అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే షిండే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ప్రజా సేవ చేయడానికే ఉద్యో గం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల మంది ఓట ర్లు ఉన్నారని, ఇతర పార్టీల వారికి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదని, దీంతో ఇతర జి ల్లాల వారిని తీసుకువచ్చి ఎమ్మెల్యే బరిలో నిలిపారని అన్నారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నల్చర్ రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంటక్రావు దేశాయ్, ఆయా గ్రామాల సర్పంచులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.