వినాయక్నగర్, ఫిబ్రవరి 8 : పోలీస్శాఖలో ఉన్నతాధికారులకు తప్పడు సమాచారాలు ఇచ్చి పక్కదోవ పట్టించిన ఘటన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. దీంతో సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్గౌడ్ నెల రోజుల క్రితం సిక్ లీవ్ పెట్టాడు.
అలాగే నవీపేట్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అనిల్కుమార్ తన తండ్రికి అనారోగ్యంగా ఉందని వారం పాటు సెలవు కోసం అధికారులకు దరఖాస్తు చేసుకొని వెళ్లాడు. వారు ఇద్దరు సెలవు కోసం చూపించిన కారణాలు సరైనవి కావని, తప్పుడు సమాచారంతో సెలవు తీసుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీపీ కల్మేశ్వర్.. వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.