ఖలీల్వాడి/ కామారెడ్డి, ఏప్రిల్ 21: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ వరంగల్, ఖమ్మం జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
దీంతో వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 487 మంది రైతులకు పరిహారం కింద రూ. 48.70 లక్షలు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 13 మంది రైతులకు లక్షా 43 వేల 750 రూపాయలు విడుదలైనట్లు జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి వీరస్వామి శుక్రవారం తెలిపారు.