కామారెడ్డి, జూన్ 16: కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి పూలమొక్కను ఇచ్చి కలెక్టర్కు స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లాలో అమలవుతున్న ధరణి, ధాన్యం సేకరణ, డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రగతిని అదనపు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చే ప్రజావాణి ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథరావు, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత, డీఈవో రాజు, డీపీఆర్వో శాంతికుమార్, తహసీల్దార్ జనార్దన్, కలెక్టర్ ఏవో మసూర్ అహ్మద్ తదితరులు కలెక్టర్కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.