ఖలీల్వాడి/ ఆర్మూర్ టౌన్, మే1: కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన మేడే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను చిన్న చూపు చూస్తున్నదని మండిపడ్డారు. ఆటోలు ఎక్కడ తిరుగుతున్నాయో అని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం, కార్మికులను చిన్నచూపు చూడడమే అని పేర్కొన్నారు. ఆటోలు తిరుగుతున్నాయా లేవా అనే విషయాన్ని కూడా తెలుసుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.