హైదరాబాద్, ఆగస్టు 10: అమెరికాకు చెందిన చిన్న, మధ్యస్థాయి వ్యాపార సంస్థలకు క్లౌడ్ ఆధారిత ఈఆర్పీ సొల్యూషన్స్ అందించే అక్యుమాటికా..హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను ప్రారంభించింది. భారత్లో ఏర్పాటు చేసిన తొలి జీసీసీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ జీసీసీలో 30 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, ఈ సంఖ్యను దశలవారీగా పెంచుకునేయోచనలో ఉన్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా ఇంజినీరింగ్ ఎక్సలెన్స్ డిజైన్డ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు అమెరికా, కెనడా, సెర్బేయా, శ్రీలంకల్లో జీసీసీలు ఉన్నాయి.