కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
విద్యానగర్, మే 24 : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆరోగ్యశ్రీ అమలుపై వైద్యాధికారులకు శిక్షణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వారం రోజులకు ఒక సారి ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పీహెచ్సీల్లో 100 శాతం సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలని కోరారు. వైద్యులు సమయ పాలన పాటించాలని పేర్కొన్నారు. పీహెచ్సీలు, సీహెచ్సీలకు ఆరోగ్యశ్రీ పథకం లాగిన్లు ఇచ్చారని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం అమలుపై వైద్యాధికారి లక్ష్మణ్సింగ్ మాట్లాడారు. పథకం అమలుపై నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. సమావేశంలో డిప్యూటీ టీఎంహెచ్వోలు, వైద్యాధికారులు, ఆర్బీఎస్కే వైద్యులు, డాటా ఎంట్రీ ఆపరేటరులు పాల్గొన్నారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి
బీబీపేట్, మే 24 : మండల కేంద్రంలో కలెక్టర్ పర్యటించారు. పీహెచ్సీతోపాటు ఎస్సీ హాస్టల్ను, బాలుర పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం వైద్య శాలలోని ల్యాబ్ గది, హాజరుపట్టిక, రికార్డులను పరిశీలించారు. ఎస్సీ హాస్టల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. హాస్టల్లోని ప్రకృతి వానాన్ని సందర్శించి మొక్కలకు నీరందించాలని సూచించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.
పల్లెప్రగతి పనులు పక్కాగా అమలు చేయాలి
దోమకొండ, మే 24 : పల్లెప్రగతి పనులు పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. దోమకొండలోని పల్లెపకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. ఎస్సీ హాస్టల్, బాలికల ఉన్నత పాఠశాలలో చేపట్టిన పనులను, నర్సరీని పరిశీలించారు. బాలుర పాఠశాలలో పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంపీపీ శారద, జడ్పీటీసీ తిర్మల్గౌడ్, వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, సర్పంచ్ నల్లపు అంజలి, ఎంపీడీవో చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.