ఆర్మూర్: అనారోగ్యంతో బాధ పడుతున్న పేదలపై ఆర్థికభారం పడకుండా ప్రభుత్వమే ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ప్రారంభించిందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలపై ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్ను ఎమ్మెల్యే సోమవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే సీఎం కేసీఆర్ ఉచిత రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ప్రారంభించారని చెప్పారు.
ఉచిత పరీక్షా కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మెట్టు సంతోష్, జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్ ఆలూర్ శ్రీనివాస్రెడ్డి, పిప్రి ఎంపీటీసీ సామెర సురేశ్ తదితరులు పాల్గొన్నారు.