ఆర్మూర్: తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన టీఆర్ఎస్ నాయకుడు అర్గుల్ సురేశ్ను ఆర్మూర్లోని ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ సంఘం వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు గురువారం ఘనంగా సన్మానించారు. సురేశ్ అనేక ఏండ్లుగా దళితుల అభ్యున్నతి కోసం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్న కృషిని గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారని ‘కోటపాటి’ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, పెర్కిట్ సొసైటీ డైరెక్టర్ మానేటి లింబాద్రి, వెల్మ రాజేందర్, మాదరి నరేశ్, ఎం.శేఖర్, మేకల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అర్గుల్ సురేశ్ నియామకమైన సందర్భంగా ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకుడు పట్వారి తులసికుమార్ ఆర్మూర్లో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. యువతరానికి సహాయ సహకారాలను అందిస్తూ వారికి తోడ్పడాలని పట్వారి తులసి ఆకాంక్షించారు.