నిజామాబాద్ : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాకులు కాల్చారు. పరస్పరం స్వీట్లు తినిపించుకుంటూ నేతలు ఆనందం పంచుకున్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు.