కామారెడ్డి/ఖలీల్వాడి, డిసెంబర్ 22 : పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చకు తెచ్చిన ఎంపీలను సస్పెండ్ చేయడం అనైతికమన్నారు. డిసెంబర్ 13 భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా వచ్చి మాట్లాడాలని అడిగినందుకు మొత్తం 146 మంది ఎంపీలపై వేటు వేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు, రైతాంగం, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు బీజేపీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఇండియా కూటమిగా డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్కు మద్దతు పలుకుతారని అన్నారు. డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్రెడ్డి, కైలాస్ శ్రీనివాస్రావు, తాహెర్బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.