సదాశివనగర్,14 ఏప్రిల్ : ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలైన సంఘటన అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో శుక్రవారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన మర్కంటి గంగయ్య శుక్రవారం మృతి చెందాడు. ఆయన అంత్యక్రియల కోసం కట్టె లు తేవడానికి గ్రామానికి చెందిన పోశయ్య(38), జోగిని పెద్ద రాజయ్య (డైవర్), జోగిని బీరయ్య, జోగిని స్వామి, మర్కంటి బీరయ్య ట్రాక్టర్పై కా మారెడ్డికి బయల్దేరారు. ట్రాక్టర్ అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులోని మైసమ్మ ఆలయం వద్దకు చేరుకోగానే ముందు, వెనుక టైర్లు పేలడంతో ట్రా క్టర్ బోల్తా పడింది. నలుగురు చెల్లాచెదురుగా పడిపోగా పోశయ్యపై ట్రాక్టర్ పడడంతో అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు.
మిగతా నలుగురికి తీవ్రగాయాలయ్యా యి. వీరిని అంబులెన్స్లో కామారెడ్డి దవాఖానకు తరలించారు. సర్పంచ్ బద్ధం శ్రీనివాస్రెడ్డి.. ఎమ్మె ల్యే సురేందర్కు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే.. గాయపడిన వారిని అంబులెన్స్లో హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించే ఏర్పాట్లు చేశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పోశయ్య భార్య సంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు సదాశివనగర్ ఎస్సై రాజేశ్ తెలిపారు.సదాశివనగర్ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి. ఉప సర్పంచ్ రవి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మ న్ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను దవాఖానకు తరలించారు. బాధితులకు ఎమ్మెల్యే సురేందర్ అండగా ఉంటారన్నారు.