కోటగిరి ఫిబ్రవరి 17 : వైద్యం కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడిన విషాద సంఘటన కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకున్నది. కోటగిరి ఎస్సై మశ్చేందర్రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలం మల్లాపురం గ్రామానికి చెందిన దినేశ్, జబ్బార్, సాయిగొండ ముగ్గురూ ద్విచక్ర వాహనంపై గురువారం సాయంత్రం వర్ని మండలం తగిలేపల్లి గ్రామానికి వచ్చారు. జబ్బార్ చేతికి గాయం కావడంతో (నాటు వైద్యం) చేతికి కట్టు కట్టించుకునేందుకు వచ్చారు.
శుక్రవారం ఉదయం జబ్బార్ చేతికి కట్టు కట్టించుకొని తిరుగుపయనమయ్యారు. కోటగిరి మీదుగా పొతంగల్ వైపు వెళ్తుండగా.. కోటగిరి నుంచి ఓ ఆర్టీసీ బస్సు సైతం అదే సమయంలో పొతంగల్ వైపు వెళ్తున్నది. అంతలోనే బస్సు వెనుక ఉన్న వీరు.. బస్సును ఓవర్టేక్ చేస్తుండగా ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ద్విక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న దినేశ్(24), జబ్బార్(32) ఇద్దరికి బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు.
సాయిగొండ పక్కనే పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. సాయిగొండను తక్షణమే 108లో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. దినేశ్, జబ్బార్ మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం బోధన్ సర్కారు దవాఖానకు తరలించామని ఎస్సై మశ్చేందర్రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబీకుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.