వినాయక్నగర్, ఫిబ్రవరి 13: నిజామాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. ఈ రైలులో పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి 144 మంది భక్తులు అయోధ్యకు వెళ్లారు. భక్తులకు ధన్పాల్ లక్ష్మీబాయి-విఠల్ గుప్తా ట్రస్టు ఆధ్వర్యంలో భోజనం, వాటర్ బాటిళ్లు అందజేశారు.