ఆర్మూర్/మాక్లూర్/కమ్మర్పల్లి/శక్కర్నగర్/ ధర్పల్లి/ ఇందల్వాయి, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, గాంధీచౌక్, తహసీల్ కార్యాలయం, రోటరీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్, పోల సుధాకర్, తాటి హన్మాండ్లు, పృథ్వీరాజ్, నరేశ్, రోటరీ క్లబ్ బాధ్యులు మంచిర్యాల సురేశ్కుమార్, విజయసారథి, పట్వారి తులసీకుమార్, లయన్స్ క్లబ్ బాధ్యులు పుప్పాల శివరాజ్కుమార్, పద్మా నర్సయ్య, చెన్న రవికుమార్, జ్ఞానీ చావ్లా, తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్, ఆర్ఐ రఫీక్, సర్వేయర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో గాంధీ విగ్రహాలు, చిత్ర పటాలకు ప్రజా ప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి దేశ స్వాతంత్య్రం కోసం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. రామచంద్రాపల్లిలో హెల్పింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో సర్పంచ్ సక్కారం అశోక్, గ్రామస్తులు, గాంధీనగర్లో కాంగ్రెస్ నాయకులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బోధన్ పట్టణ, ఎడపల్లి పోలీసుస్టేషన్లలో పోలీసులు అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ ప్రేమ్కుమార్, ఎస్సైలు మోహన్రావు, పీటర్, ఎడపల్లి ఏఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని ధర్పల్లి మండలంలో ఆదివారం నిర్వహించారు. తహసీల్ కార్యాలయంలో సిబ్బంది గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయసాధన కోసం కృషి చేద్దామని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్ కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఇందల్వాయి గ్రామ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు కన్నయ్యగౌడ్, సభ్యులు పాల్గొన్నారు.