ఇందల్వాయి, ఫిబ్రవరి 5: పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి వంచించిన ఓ పోలీసు అధికారి బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. న్యాయం కోసం బాధితురాలు ఠాణా ఎదుట బైఠాయించింది. దీంతో సదరు అధికారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. అసలేం జరిగిందింటే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇందల్వాయి పోలీసుస్టేషన్ ఎదుట ఆదివారం రాత్రి ఆందోళనకు దిగింది. ఎస్సై మహేశ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు అక్కడే బైఠాయించింది.
పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని వాపోయిన ఆమె.. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఈ సమాచారం తెలిసి ఉన్నతాధికారులు మందలించినట్లు తెలిసింది. మరోవైపు, సదరు ఎస్సై తన సిమ్కార్డును పోలీసుస్టేషన్లోనే ఉంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారుల వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు సరిగా స్పందించలేదు.