నందిపేట్, అక్టోబర్ 20 : పదేండ్లలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆర్మూర్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురంలో భాగంగా శుక్రవారం డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో ప్రజాఆశీర్వాద యాత్రలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో జీవన్రెడ్డికి ప్రజలు డప్పువాయిధ్యాలు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. వందలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి తమ అభిమాన నేతను ఆప్యాయంగా స్వాగతించారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాతుడూ ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోందని, ఆర్మూర్లోని సిద్ధుల గుట్ట గొప్ప దివ్య క్షేత్రంగా పర్యాటక స్థలంగా మారిందని అన్నారు. తాను మారంపల్లి గ్రామ అల్లుడిని, తనకు అండగా నిలవాలని కోరారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణకు భరోసా అని, కాంగ్రెస్, బీజేపీలోస్తే మళ్లీ అదే అరిగోస పడక తప్పదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏనాడైనా మీ ఊరికొచ్చారా, మీ బాగోగులు చూశారా అని ప్రశ్నించారు. కారు డ్రైవర్ చెప్పకుండా ఏ ఊరికి ఎలా వెళ్లాలో కూడా తెలియని ఈ కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
మారంపల్లి ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి సతీమణి రజితారెడ్డి మాట్లాడుతూ మన ఊరి అల్లుడు జీవన్రెడ్డిని గెలిపించుకుని మారంపల్లి గ్రామాభివృద్ధికి బాట వేసుకుందామని పిలుపునిచ్చారు. ఊరు ఊరంతా తన భర్త జీవన్రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ ఒకటిగా నిలవడం తనకు సంతోషం కలిగిస్తున్నదన్నారు. ‘మీ ఓటు కారు గుర్తుకు వేయండి, జై తెలంగాణ’ అంటూ రజితారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గజం రాజు, కచ్చకాయల రాజేశ్వర్ బీఆర్ఎస్లో చేరగా పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి జీవన్రెడ్డి ఆహ్వానించారు. నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు బోగ రాము బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆయనకు గులాబీ కండువా కప్పి జీవన్రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోగ రామును బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్యే ప్రకటించారు.
మాక్లూర్, అక్టోబర్ 20: బీఆర్ఎస్ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురంలో భాగంగా మండలంలోని అడవిమామిడిపల్లి గ్రామంలో ప్రజాఆశీర్వాద యాత్రలో జీవన్రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను మళ్లీ ఆశీర్వదించారని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు