నిజామాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మక్క రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 63వేల ఎకరాల్లో మక్కను సాగుచేయగా, గతంలో మాదిరిగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ యోచిస్తున్నది. రైతులు నష్టపోకుండా కొండంత భరోసా కల్పించడమే ధ్యేయంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. ఒకట్రెండు రోజుల్లోనే మక్కల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుకు కనీస మద్దతు ధర దక్కనున్నది. రెండు జిల్లాల్లో సుమారు 4లక్షల మెట్రిక్ టన్నులకుపైగా దిగుబడి వచ్చే అవకాశం ఉండగా, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై మక్క రైతులు సంబురపడుతున్నారు.
యాసంగిలో పండించిన మక్కల కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉభయ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికార యంత్రాంగం సన్నాహకాలు ప్రారంభించింది. రెండేం డ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో మొత్తం 63 కేంద్రాలను మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిం ది. ప్రస్తుతం అదే స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రయత్నిస్తున్నది. కనీస మద్దతు ధరను చెల్లిస్తూ రైతులు నష్ట పోకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో విరివిగా కేంద్రాల ఏర్పాటుతో రైతుకు కొండంత భరోసా కల్పించడమే ధ్యేయం గా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఒకట్రెం డు రోజుల్లోనే మక్కల కొనుగోళ్లు షురూ కానున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై మక్క పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. మక్కల కొనుగోళ్లకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో క్షేత్ర స్థాయిలో పంటల సేకరణ ప్రక్రియ సందడి నెలకొననున్నది.
63వేల ఎకరాల్లో మక్క పంట సాగు..
ఉమ్మడి జిల్లాలో సాగు తీరు కొంత కాలంగా మారుతూ వస్తున్నది. రైతులు విభిన్నమైన పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇందులో భాగంగా ఉభయ జిల్లాల్లో కొంత మంది రైతులు నీటి వసతిని దృష్టిలో పెట్టుకుని మక్క సాగుకు మొగ్గు చూపుతున్నారు. దిగుబడి చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షాలతో మక్క తడిసి ముద్దవుతున్నది. ప్రైవేటు వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉన్న మక్కలకు ఒక్కసారిగా ఆదరణ కరువైంది. దీంతో ప్రభుత్వమే రైతుల ప్రయోజనం కోసం రంగంలోకి దిగింది. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం స్వతహాగా స్పందించి మక్కల కొనుగోళ్లపై కీలమైన నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో మక్కజొన్న 30వేల ఎకరాల్లో సాగుచేయగా.. రెండు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానున్నది. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 33వేల ఎకరాల్లో మక్కజొన్నను సాగు చేయగా రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. గతంలో మార్క్ఫెడ్ అధికారులు ఆయా ప్రాంతాల్లో మొత్తం 63 మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మక్కజొన్న క్వింటాలుకు రూ.1900 ఉన్నది. ఈ ధరతోనే మార్క్ఫెడ్ రైతుల నుంచి మక్కలను సేకరించనున్నది.
ప్రైవేటు వ్యాపారులకు చెక్..
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రైవేటు వ్యాపారుల ఆగడాలకు చెక్ పడింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళారుల మధ్యవర్తిత్వం విపరీతంగా ఉండేది. రైతుల కు ఆరుగాలం పండించిన పంటపై లాభాలు రాకపోగా.. దళారులకు మాత్రం రెట్టింపు లాభాలు వచ్చేవి. ప్రతి సీజన్లో లాభాలను ఆర్జించేందుకు అన్న దాతలు పడిన శ్రమ ఆవిరయ్యేది. తెలంగాణ సిద్ధించిన అనంతరం బ్రోకర్లు, మధ్యవర్తుల పాత్ర నామరూపాల్లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు నమ్మకం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుధరను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటున్నది. ధాన్యం విక్రయించే రైతుల బ్యాంక్ అకౌంట్లలోనే వారికి చెల్లించాల్సిన మొత్తం డబ్బులను జమ చేసే వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇదే పద్ధతిలో మార్క్ఫెడ్ ద్వారా పారదర్శకమైన కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నది. ఏటా శనగలు, మక్క వంటి పంట ఉత్పత్తులను మార్క్ఫెడ్ ద్వారానే ప్రభుత్వం సేకరిస్తున్నది. పౌరసరఫరాల సంస్థ, మార్క్ఫెడ్ ద్వారా చేపడుతున్న కొనుగోళ్లతో రైతుల్లో పంట విక్రయాలపై నమ్మకం పెరిగింది. ఎక్కడా ఇసుమంతైనా మధ్యవర్తులన్న మాటే వినబడకుండా చేయడంలో రాష్ట్ర సర్కారు విజయం సాధించింది.
కేంద్రాల ఏర్పాటు సంతోషకరం..
యాసంగిలో మక్కజొన్న పంటను సాగుచేసిన రైతుల మేలు కోసి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయడం సంతోషకర మైన విషయం. కేంద్రాల ఏర్పాటుతో మక్కలు పం డించిన రైతులకు కనీస మద్ద తు ధర దక్కుతుంది.
– దేమె గంగాధర్, రైతు, గాంధారి
మద్దతు ధర దక్కుతుంది..
మక్క రైతులను ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ సార్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడం సంతో షం కలిగించింది. గిట్టుబాటు ధరలేక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు మద్దతు ధర దక్కుతుంది.
– పత్తి బాల్రెడ్డి, రైతు, గాంధారి