మోర్తాడ్, అక్టోబర్ 28: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువప్రాంతం నుంచి ఇన్ఫ్లో పెరిగింది. మంగళవారం ప్రాజెక్ట్లోకి 34,654 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1091అడుగుల(80.501టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 34,654 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు 12వరద గేట్ల ద్వారా 25 వేలు, ఎస్కేప్గేట్ల ద్వారా 6వేలు, కాకతీయకాలువకు 2వేలు, సరస్వతీకాలువకు 650, లక్ష్మీకాలువకు 200, మిషన్భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 573 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.